పోలీస్ డిపార్ట్మెంట్

లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు మరియు ప్రజల భద్రతకు మద్దతిచ్చే ముందడుగు

"మంచి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అవసరమైన వైద్య సేవలను పొందేలా చేస్తుంది." - కైలాష్ సత్యార్థి

అవంతి ఫౌండేషన్‌కు ప్రజా భద్రత పట్ల ఉన్న నిబద్ధత మరియు లా ఎన్ఫోర్స్మెంట్‌కు మద్దతు ఇవ్వడం పలు కార్యక్రమాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది.

మేము తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరులోని గోష్పాదక్షేత్రంలో సిసిటీవీ నిఘా సౌకర్యాలను ప్రారంభించి, ప్రజలకు భద్రతా చర్యలను పెంచాము మరియు నిఘా ప్రయత్నాలలో పోలీసు శాఖకు సహాయం చేసాము.

అదనంగా, కమ్యూనిటీ కార్యకలాపాల కోసం మరియు సమర్థవంతంగా విధుల నిర్వహణ కోసం మేము రూ. 500,000/- లతో పోలీసు కమ్యూనిటీ హాల్ మరియు ఎస్‌డిపిఒ కార్యాలయం నిర్మాణం కోసం వెచ్చించడం జరిగింది.

కాకినాడ జిల్లా, ఏలేశ్వరం పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో మరుగుదొడ్లను పునరుద్ధరించడంతోపాటు, కొవ్వూరులోని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ హాల్‌ను నిర్మించడం ద్వారా, మౌలిక సదుపాయాలను పెంపొందించడంలో మా అంకితభావం విస్తరించింది. ఈ ప్రయత్నాలు భద్రతను పెంపొందించడంలో మరియు సామరస్యపూర్వకమైన సమాజాన్ని సృష్టించడంలో మా సమిష్టి బాధ్యతను ప్రతిబింబిస్తాయి.